డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర – ధర్మవరం : కంటి కలక వ్యాధి(కళ్ళ కలక) అంటువ్యాధి అని, ఈ వ్యాధి నుండి ప్రజలు జాగ్రత్తలు వహించాలని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణములోని మధు అండ్ వృద్ధుల కంటి వైద్యశాల శాలలో వారు మాట్లాడుతూ ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాల ప్రారంభంలో అందరికీ వస్తుందని, దీనివల్ల రెండు కళ్ళు పుశులు కట్టడం, నీరు కారడం,కనుగుడ్లు ఎర్ర పడటం లాంటివి జరుగుతుంటాయని తెలిపారు. తదుపరి కొన్ని రోజులు తర్వాత కళ్ళు గుచ్చుకుంటున్నట్టు కూడా అనిపిస్తాయని తెలిపారు. ఈ వ్యాధి పడినవారు కేవలం కంటి వైద్యుల వద్ద తగిన సలహాతో పాటు వైద్య చికిత్సలు పొందాలన్నారు. ఈ వ్యాధి మనిషి నుండి మనిషికి, ఈగల ద్వారా కలక ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు కళ్ళకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. వైద్యున్ని సంప్రదించకుండా ఏ విధమైన సొంత వైద్యం పాటించితే కళ్ళు పోయే ప్రమాదం ఉందన్నారు. కళ్ళల్లో నెయ్యి లేదా తేనె వేయరాదని, చల్లని శుభ్రమైన నీటితో తరచుగా శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ వ్యాధి విస్తరించకుండా ఉండడానికి పారిశుద్ధ్యం ప్రధాన మార్గమని, కుటుంబంలో వాడే దుప్పట్లు, దిండ్లు, పక్క మీద ఉపయోగించే బట్టలు వేరువేరుగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతిరోజు ఈ వ్యాధి వచ్చిన వారు తమ కండ్లను శుభ్రం చేసుకోవాలని పదేపదే కళ్ళు నలుపుకూడదని తెలిపారు. ఎండ తీవ్రత తట్టుకునే విధంగా కూడా కంటి అద్దాలను ధరించాలని తెలిపారు. కంటి పట్ల జాగ్రత్తలు వహించకపోతే, కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.