ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబు
విశాలాంధ్ర-రాప్తాడు : వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు(పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల(ఏపీఓ) పాత్ర కీలకమని రాప్తాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబు అన్నారు. మండలంలోని పంగల్ రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాలకు సంబంధించి
పిఓ, ఏపిఓలకు మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు.
పోలింగ్ విధులు, ఈవీఎంలపై అవగాహన కల్పించారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాల్లో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణ, పీఓల హ్యాండ్ల బుక్లో సూచించిన విధంగా పోలింగ్ సామగ్రి పొందడం, ఫారాలు, కవర్స్, మెటీరియల్, మాక్ పోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధానం, ఈవీఎంలను సీజ్ చేయడం తదితర అంశాలపై గురించి వివరించారు. మాక్ పోల్, నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభించడం, ఓటింగు గోప్యత నిబంధనలు, బ్యాలెట్
గోప్యతను కాపాడేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇలా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు, ఏపీఓల నుంచి పోస్టల్ బ్యాలెట్ 12, 12ఏ ఫారాల ద్వారా వివరాలు పొందాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాప్తాడు తహశీల్దార్ టి.సీతారాం, ఏఈఆర్ఓలు, డీటీ, ఈడీటీలు, సిబ్బంది పాల్గొన్నారు.