పవర్లూమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలా వెంకటనారాయణ
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని పవర్ లూమ్స్ లో చీరల తయారీని జులై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు బంద్ చేస్తున్నట్లు పవర్లూమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు.. పోలా వెంకటనారాయణ, సహకారదర్శి.పళ్ళ నవీన్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో చేనేత వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకొని రావడంతో వారి సూచనల మేరకు పవర్ రూమ్స్ ను బంద్ చేస్తున్నట్లు తాము ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి పవర్లూమ్స్ చీరలు ధర్మవరం పట్టణానికి రాకుండా తగిన చర్యలు సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతి పథకాల చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. అంతేకాకుండా కొంతమంది నాయకులు పవర్లూమ్స్ వల్ల చేనేత పరిశ్రమ ఇబ్బంది పడుతోందన్న తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ధర్మవరంలో 95 శాతము పవర్ లూమ్స్ చీరలు దొడ్బల్లాపూర్, యలహంక హిందూపురం, సోమందేపల్లి ,,మదనపల్లి, ఇతర ప్రాంతాల నుండి వస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యములో భాగంగా హ్యాండ్లూమ్ చీరలతో పాటు, పవర్ లూమ్స్ చీరల వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందని అధికారులు గమనించాలని వారు తెలిపారు. ధర్మవరం పవర్లూమ్స్ వల్లే నష్టం జరుగుతుందన్న తప్పుడు సంకేతాలు ఇవ్వడం సరికాదని తెలిపారు. మా పవర్ లూమ్స్ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి విన్నవించుకోవడం జరిగిందని తెలిపారు. చర్చలు అనంతరం జూలై నెల అంతా మూసివేస్తామని తాము ప్రకటించడం జరిగిందని తెలిపారు. నెలరోజుల పాటు పవర్ లూమ్స్ ను మూసివేస్తామని అటు తర్వాత ఈ ఒడిదుడుకులు ఇలాగే ఉంటే మా పవర్లూమ్స్ వ్యవస్థకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.