జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ రామకృష్ణరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 363 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించడంపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి లబ్ధిదారుని సంప్రదించి నాణ్యత కలిగిన పరిష్కారం చూపించడం అధికారుల బాధ్యత అన్నారు. గడువులోపు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ నాగరాజు నాయుడు, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, డీఎంహెచ్వో డా.ఈబీ దేవి, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, హార్టికల్చర్ డిడి నరసింహారావు, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డా.వెంకటేశ్వరరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాణిక్యరావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డివిఈఓ వెంకటరమణ నాయక్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిటిసి వీర్రాజు, సిపిఓ అశోక్ కుమార్, ఎల్ డి ఎం నరసింగరావు, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.