Friday, May 17, 2024
Friday, May 17, 2024

సమస్యాత్మక గ్రామాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి…

గ్రామసభల ద్వారా ప్రజలకు దిశానిర్ధేశం
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ఆయా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల వేళ ఎలా మెలగాలో గ్రామసభల ద్వారా ప్రజలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రశాంత ఎన్నికలే మాలక్ష్యం… స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు వేయమని సూచిస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో డీఎస్పీలు, సి.ఐ లు, ఎస్సైలు గ్రామసభలు నిర్వహించి ప్రజల్ని సమాయత్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img