విశాలాంధ్ర – ధర్మవరం : ఎస్కే యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలలో పట్టణంలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు విజయ ప్రభంజనం మోగించారని ప్రిన్సిపాల్ మల్లికార్జున కరెస్పాండెంట్ బుట్రా సాయి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం అత్యధిక మార్కులే గాక ఓవరాల్ రిజల్ట్ ను ఏ కోణంలో విశ్లేషించిన మా కళాశాల విద్యార్థినుల విద్యా వైభవం స్పష్టంగా సాక్షాత్కరించిందని తెలిపారు. బీకాం హానర్స్ గ్రూపు నందు కె. విజయదుర్గ 90 శాతము, ఎం. జ్యోతి 87 శాతము, కె. పరిహీన 85 శాతము, బి ఫరీదా, డి. నాని, టి. ఆర్సియా 80 శాతం, బి బి ఏ హానర్స్ గ్రూపు నందు బి. స్నేహప్రియ 82 శాతం, డి. హిమబిందు 80 శాతము, సాధించడం జరిగిందన్నారు. వీరందరిని ప్రిన్సిపాల్ తో పాటు కరస్పాండెంట్ సాయి, అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు