కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ
విశాలాంధ్ర – ధర్మవరం : అన్ని వర్గాల వారిని ఆదుకొని,అభివృద్ధి బాటలో ముందుకు వెళతామని, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని, అదేవిధంగా తాను కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగాన అశ్వర్థ నారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పట్టణంలోని సిరికల్చర్ ఆఫీస్ సిద్దయ్యగుట్ట సుందరయ్య నగర్ సత్యసాయి నగర్లలో ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్లో కూడా కచ్చితంగా అభివృద్ధి బాటలో నడపాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించి, అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు.. కర్ణాటక, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కు రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు తప్పక అందజేస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను తప్పక అమలు చేసి తీరుతామని తెలిపారు. చేనేతకు జీఎస్టీని మినహాయింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సి ఏ ఏ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్, యు సి సి చట్టాలను రద్దు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు, రైతు పెట్టుబడి మీద 50 శాతము లాభంతో మద్దతు ధర, ఉపాధి హామీ కూలీకి రోజుకు కనీసం 400 రూపాయలు వేతనము, వృద్ధులకు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు 6000రూ .పెన్షన్ ఇవ్వబడుతుందని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు గ్యారంటీతో తదితర పథకాలను వెనువెంటనే అమలు చేస్తామని చేనేత వ్యాపారులు కార్మికుల సంక్షేమానికి చేనేత బ్యాంకు ఏర్పాటు చేస్తామని, పట్టు ముడి సరుకు కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తామని, చేనేత ప్రాంతాలలో ప్రభుత్వ సహకారంతో ముడి సరుకు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఆంధ్ర సిల్క్స్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ఆత్మహత్యలు చేసుకున్న నేతలను తగిన ఆర్థిక సహాయంతో ఆదుకుంటామని తెలిపారు. ఓటుతోనే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేది కేవలం ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ నేనని, గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఎంతో కృషి చేసిందని నియోజకవర్గానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుతానని ఇండియా కూటమితోనే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేకూర్చుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు తాహీర్, నారాయణస్వామి, మునఫ్,జాఫర్, కరీం, సాయి, శంకర్, రాజు, మన్సూర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.