జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు.
రాప్తాడులోనీ అనంతపురం రూరల్ డీఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సి.ఐ లు, ఆర్ ఐ లతో ఆయన గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సీఎం ఈనెల 18 వ తేదీన రాప్తాడుకు విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ , తదితర విషయాలపై దిశానిర్ధేశం చేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, ఎస్ లక్ష్మినారాయణరెడ్డి(ఏ.ఆర్), డీఎస్పీలు బి.వి శివారెడ్డి, ఎం ఆంథోనప్ప, బి.శ్రీనివాసులు, సి.ఎం.గంగయ్య, భాస్కర్ రెడ్డి, హేమంత్ కుమార్ (ట్రైనీ డీఎస్పీ), పలువురు సి.ఐలు, ఆర్ ఐ లు పాల్గొన్నారు.