సిపిఐ తరిమెల రామాంజనేయులు
శింగనమల మండల వ్యాప్తంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో గుర్తించిన పనులను ఉపాధి కూలీలతో చేయించాలని, పనులలో నాణ్యత పెంచాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ బ్రహ్మయ్యకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు, ఈ సందర్భంగా తరిమెల రామాంజనేయులు మాట్లాడుతూ తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు,నియోజకవర్గ కేంద్రమైన శింగనమలలో గత నాలుగు నెలల నుండి విద్యుత్ అధికారి లేక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రెగ్యులర్ ఏఈ నియమించి అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలని, రెవిన్యూ శాఖలో పట్టుకొమ్మలుగా ఉన్న విఆర్వోలు రైతులుకు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీఆర్వోలు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు, మండల వ్యాప్తంగా చౌక ధాన్యపు డిపో డీలర్లు తూకాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం నుంచి నిత్యవసర వస్తువులు,బియ్యం, కంది బేడలు చక్కెర పామాయిల్ తదితర వాటిని ఏమాత్రం ప్రజలకు అందించకుండా బియ్యం మాత్రమే అందిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో ఎం,శ్రీనివాసులు, పట్రా శివ శంకర్, దైవత్వం,దుబ్బన్న, షెక్షావలి, లక్ష్మి రంగయ్య,ఇరువెందల శ్రీరాములు, మట్ల గొంది శంకర, ఉల్లికల్లు ఆదినారాయణ, చిన్న జలాలపురం నాగముని, తదితరులు పాల్గొన్నారు