వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర – ధర్మవరం:: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహిస్తామని, ఇందుకు ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ నాయకుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని వంటవలసిందే సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పలు విషయాలను, జాగ్రత్త లను ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, సమస్యత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిగా కూడా పెట్టడం జరిగిందని తెలిపారు. రౌడీ షీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగెర్స్, హిస్టరీ షీటర్ల కదిలికపై కూడా ప్రత్యేక నిగా ఉంచామని, సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ట నిఘాతోపాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ధర్మవరం పట్టణములో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టివ్ అమలులో ఉందని, కావున ప్రజలు ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండి ప్రజా శాంతికి భంగం కలిగించరాదని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు అని స్పష్టం చేశారు. గెలిచిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బాణాసంచా నిల్వ ఉంచడం క్రయ,విక్రయాలు చేయడం, కాల్ చేయడం నిషేధమని, చట్టరీత్యా నేరమని, తెలిపారు. ఓడిన వారిపట్ల కవ్వింపు చర్యలకు పాల్పడడం, హేళన చేయడం, రెచ్చగొట్టడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌంటింగ్ వేల అపరిచితులు అనుమానితులు లాడ్జిలో బస చేయకుండా ఉండాలని,పందాలు కాయకుండా లాడ్జిలో తనిఖీలు కూడా ముమ్మరం చేశామని, మద్యం సేవించి గొడవలకు కారణమయ్యే అవకాశం ఉన్న హోటలలో కూడా క్షుణ్ణంగా చెకింగ్ లు చేయడం జరిగిందన్నారు. పై వాటిని అతిక్రమించి పోలీసు వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు మీరే తగు బాద్యులు అగుదురని తెలియజేశారు.