తల్లిదండ్రులకు ఊరటనిచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారులు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : అనంతపురం జిల్లాలో 10వ తరగతి నాల్గవ పేపర్ మ్యాథమెటిక్స్ పరీక్ష శుక్రవారం ఉదయం 9:30 గంటల నుండి 12:30 వరకు నిర్వహించగా ఈ పరీక్షకు 34019 మంది హాజరు కాగా..3274 మంది గైరహాజరు అయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి, ఏ.సి గోవింద నాయక్ తెలిపారు. ఓపెన్ ఇంటర్మీడియట్ 1259 మంది హాజరు కాగా.. 96 మంది గైరహాజరు.. ఓపెన్ ఎస్ఎస్సి 799 మంది హాజరు కాగా..83 మంది గైరహాజరు అయ్యారని పేర్కొన్నారు. మ్యాథమెటిక్స్ పరీక్ష సులువుగా రావడంతో పరీక్ష బాగా రాశామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులకు ఊరట నిచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారులు..
ఒకవైపు పరీక్షలు మరోవైపు భానుడు ప్రతాపంతో వేసవి తాపాన్ని తట్టుకోలేక పరీక్ష కేంద్రంలోని గేటు బయట నిలుచుని ఉంటూ.. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్ష ముగింపు మధ్యాహ్నం 12.30 సమయంలో పరీక్ష కేంద్రం ఆవరణంలోని ఉన్న చెట్ల వద్ద ఉండేందుకు అనుమతి ఇవ్వడంతో కాస్తంత ఊరటను ఇవ్వడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. ప్రైవేట్ వసతి గృహాల్లో ఉంటూ.. పరీక్ష రాసి వచ్చిన విద్యార్థులతో పరీక్ష పై మిత్రులు, తల్లిదండ్రులు , స్నేహితులు, బంధువులు యోగక్షేమాన్ని తెలుసుకుంటూ.. మెరుగైన ఫలితాల కోసం పరీక్ష పై సన్నద్ధతపై విద్యార్థులకు ధైర్యం నింపుతూ ఉన్నారు.