గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ కిషోర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఎస్పీ ఆరిఫ్ మీడియా ఎదుట హాజరుపరిచారు. అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కీలక విషయాలు వెల్లడిరచారు. నిందితుడు కృష్ణ కిషోర్ని విజయవాడ రైల్వే ట్రాక్పై పట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణ కిషోర్ ఈ కేసులో ప్రధాన నిందితుడని.. షేక్ హబీబ్ అనే వ్యక్తి కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు తెలిపారు. అత్యాచారానికి ముందు నిందితులు ఒకరిని హత్య చేశారని ఎస్పీ వెల్లడిరచారు.జులై 19 సీతానగరం ఇసుక దిబ్బల వద్దకు సేద తీరడానికి వెళ్లిన ఓ జంటపై దాడిచేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.