రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి(ఆగస్టు 16) నుంచి ఇప్పటివరకు 28 మంది విద్యార్థులు, 48 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. కలెక్టర్ ప్రవీణ్కుమార్ నిర్వహించిన సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఈ విషయం వెల్లడిరచారు. కొవిడ్ ప్రొటోకాల్ను పక్కాగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కేసులు నమోదైన పాఠశాలలను విద్యాశాఖాధికారులు సందర్శించి వివరాలు టాస్క్ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.