పెండిరగ్ బకాయిలు రూ.1,41,588 కోట్లు
నేడు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:రాష్ట్ర ఆదాయం, అప్పుల వివరాలను ప్రజల ముందుంచేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం… 2019-24 మధ్య పెండిరగ్ బిల్లులు రూ.1,41,588 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండిరగ్ బిల్లులు రూ.వేల కోట్లు ఉన్నట్టు తేల్చింది. పెండిరగ్ బిల్లుల్లో రూ.93 వేల కోట్లు సీఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదని, రూ.48 వేల కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధ్ధారించింది. భారీగా నీటిపారుదలశాఖ, పోలవరం బిల్లులు పెండిరగ్లో ఉన్నట్లు, ఇంకా వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలు గుర్తించారు. ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్లు పెండిరగ్ బిల్లులు ఉన్నాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, ఆస్తులు తనఖా పెట్టి తెచ్చిన అప్పులు, ఆర్బీఐలో బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాలన్నీ కలిపి రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లపైనే ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ వివరాలన్నీ శ్వేతపత్రం ద్వారా శుక్రవారం సీఎం చంద్రబాబు అసెంబ్లీ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఆర్థిక శాఖాధికారులు పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేశారు.