Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దిల్లీకి జగన్‌

. నేడు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ధర్నా
. అసెంబ్లీ, మండలి సమావేశాలకు వైసీపీ దూరం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో హింస, అరాచకాల కారణంగా శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఈనెల 25వ తేదీ బుధవారం దిల్లీలో వైసీపీ ధర్నా చేయనుంది. ఈ నిరసన కార్యక్రమంతో పాటు ఫొటోగ్యాలరీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో 45 రోజులుగా కొనసాగుతున్న ఆకృత్యాలను వైసీపీ దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లనుంది. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరానికి జగన్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరుకున్నారు. అక్కడి నుంచి దిల్లీకి పయనమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1,050 దాడులు, దౌర్జన్యాలు, 300 హత్యాయత్న ఘటనలు, 560 ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అయినట్లుగా జగన్‌ చెబుతున్నారు. మరో 2,700 కుటుంబాలు ప్రాణ భయంతో ఊళ్లు వదిలి పారిపోయే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొంటున్నారు. ఈ ధర్నా సందర్భంగా మూడు రోజులపాటు దిల్లీలోనే జగన్‌, ఆ పార్టీ నేతలు మకాం వేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రితో పాటు వివిధ మంత్రుల అపాయింట్‌మెంట్‌ను వైసీపీ కోరింది.
ఈనెల 22న దిల్లీలో హోం మంత్రి అమిత్‌ షాతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా భేటీ అయి… రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులను వివరించారు. వైసీపీ నేతలు, పార్టీ సానుభూతి పరుల హత్యలు, హింసాత్మక సంఘటనలపై రాష్ట్రపతికి, ప్రధానికి, హోం మంత్రికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పిందనందున రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
అసెంబ్లీ, మండలి సమావేశాల సమయంలో దిల్లీకి జగన్‌
అసెంబ్లీ, శాసన మండలికి వైసీపీ సభ్యులు ఎవ్వరూ హాజరుకాకుండా దిల్లీకి పయనమయ్యారు. దీంతో రెండోరోజు అసెంబ్లీలో వైసీపీ సభ్యులు కనిపించలేదు. శాసన మండలిలోనూ ఆ పార్టీ సభ్యులు దూరంగా ఉన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన సమయంలో ఇలా జగన్‌ అసెంబ్లీకి వెళ్లకపోవడంపైనా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్యపై గానీ, ఏపీకి ప్రత్యేక హోదా అమలుపై గానీ దిల్లీలో ఇంతవరకు వైఎస్‌ జగన్‌ ఎందుకు ధర్నా చేయలేదంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశాన్ని టీడీపీ నేతలు ఘాటుగా జగన్‌ను నిలదీస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నిర్మాణాత్మకమైన సూచనలు చేయకుండా జగన్‌ దిల్లీకి వెళుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img