Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి నిరాశ.. పిటిషన్ డిస్పోజ్, అదొక్కటి ఊరట!

ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కలేదు. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేయగా.. ఇవాళ విచారణ జరిగింది. మంగళవారం రోజు ఎన్నికల కమిషన్ హైకోర్టును 24 గంటల సమయం కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన విచారణలో.. ఈసీ తరఫు లాయర్ కోర్టుకు కీలక విషయాలను తెలిపారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న ఎంపీ స్థానాల్లో.. గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని న్యాయస్థానానికి తెలిపారు. అంతేకాదు జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రధానంగా గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని తెలియజేశారు. ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలియజేసిన అంశాలతో జనసేన పార్టీకి కొంత ఊరట కలిగించినా.. మిగిలిన స్థానాల్లో కూటమి అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు వేరే అభ్యర్థులకు కేటాయించొద్దని కోరారు. అయితే గాజు గ్లాసు గుర్తు ఎన్నిలక కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో.. మిగిలిన చోట్ల అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే కనుక మరో పిటిషన్ వేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో జనసేన పార్టీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేసింది.. అయితే కోర్టు మాత్రం పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం టీడీపీ, బీజేపీలకు తలనొప్పిగా మారింది. ఈవీఎంలలో గాజు గ్లాసు గుర్తు ఉంటే.. తమకు పడాల్సిన జనసేన ఓట్లు పొరపాటున స్వతంత్ర అభ్యర్థికి పడే అవకాశం ఉందంటున్నారు. మరి టీడీపీ, బీజేపీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img