నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే మంగళవారం నిర్వహించిన సభలో లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. తిరుమలలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన గెలుపును ఆపాలన్నారు. లోకేష్ బహిరంగ సభలో విమర్శలు చేయడం కాదని.. దమ్ముంటే ఇవాళ మధ్యాహ్నం లోపు తనతో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. తనపై చేసిన ఆరోపణల మీద తిరుమల కొండపై ప్రమాణానికి రావాలన్నారు.. నిజం చెబితే తల పదివేల ముక్కలవుతుందని లోకేష్కు శాపం ఉందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా కౌంటరిచ్చారు. నెల్లూరు జన సమీకరణ కోసం లోకేష్ ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారన్నారు.సభ పెట్టిన పక్కనే ఉన్న చీుR విగ్రహానికి పూలమాల కూడా వెయ్యకపోవడం సిగ్గు చేటన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్కి ఉందా అన్నారు. కార్పొరేటర్లు లే అవుట్లు వేస్తే.. దాన్ని కూడా తానే వేసినట్లు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. చెన్నైలో తాను రూ.50 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసినట్లు ఆరోపించారని.. కానీ తాను అద్దె ఇంట్లో ఉంటానని చెప్పారు. డాక్యుమెంట్తో సహా తీసుకొచ్చి మీడియాకు విడుదల చేశారు.