వృద్ధురాలి నోట్లో బట్టలు కుక్కి 3 తులాల బంగారాన్ని మాజీ మహిళా వాలంటీర్ దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలోని ఓ ఇంట్లో ఒంటరిగా అచ్చెమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. మాజీ మహిళా వాలంటీర్ స్వాతి ఆ వృద్ధురాలి నోట్లో బట్టలను కుక్కి 3 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయింది. అయితే ఆ వృద్ధురాలు మరణించిందని మహిళా వాలంటీర్ భావించింది. దొంగతనం విషయం వెలుగులోనికి రావడంతో మాజీ వాలంటీర్ స్వాతి ఉలిక్కిపడింది. సంగతి పోలీసులకు తెలియడంతో ఎస్సై జయంతి ఆమెను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఎస్ఐ వద్ద నిజం ఒప్పుకోవడానికి మాజీ వాలంటీర్ మొండికేసింది. ఆ తరువాత ఎట్టకేలకు మాజీ వాలంటీర్ స్వాతి దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని బంగారం ఇస్తానని చెప్పింది.