విశాలాంధ్ర -రాయదుర్గం: రాష్ట్రంలో జరుగుతున్నా అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ 184 వ, బూత్ లో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా కాపు మాట్లాడుతూ.భారత రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధం తో సరైన నాయుకుడిని ఎన్నోకోవాలని ఓటు హక్కుతో సరైన పాలనకు శ్రీకారం చుట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ,ప్రతీ ఒక్క ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని,ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి కోరారు. కాపు వెంట అయన సతీమణి కాపు భారతి,కూతురు డా. స్రవంతి రెడ్డి తనయుడు కాపు ప్రవీణ్. కోడలు అలేఖ్య రెడ్డి తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు.