వసుమతిదేవి భవనం ప్రారంభ సభలో నారాయణ
విశాలాంధ్ర – నగిరి : ప్రజాసమస్యల పరిష్కార కేంద్రాలుగా పార్టీ కార్యాలయాలు ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టరు కె. నారాయణ పిలుపునిచ్చారు. నిత్యం ఉద్యమాలతో ప్రజలతో మమేకమై సమస్యల పైన కాకుండా కేంద్ర ,రాష్ట్ర , ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పైన నిరంతరం రాజీలేని పోరాటాలకు సీపీఐ కార్యకర్తలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగిరిలో సీపీఐ కార్యాలయం వసుమతి భవన్ను శనివారం నారాయణ ప్రారంభించారు. అనంతరం సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి టి. కోదండయ్య అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదు ర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం స్పందించి ఉద్యమించడమే కాకుండా, అట్టడుగు బడుగు బలహీన వర్గాలు చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఈ కార్యాలయం ఉపయోగపడే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యాలయం ముందు ఎర్రజెండాను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, తిరుపతి జిల్లా కార్యదర్శి పీ.మురళి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఎం .శ్రీరాములు, నగిరి నియోజకవర్గ కార్యదర్శి టి. కోదండయ్య తిరుపతి నగర కార్యదర్శి జే.విశ్వనాథ్ ,చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.