Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన గురించి తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపారు. దీంతో రామోజీరావు పేరు గూగుల్ టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా నిలిచింది. రామోజీరావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో జూన్ 5న కుటుంబసభ్యులు నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామోజీరావును పరీక్షించిన డాక్టర్లు ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్టు గుర్తించి, స్టంట్‌ అమర్చారు. రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం.. శుక్రవారం రాత్రి విషమించింది. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన స్వర్గస్తులయ్యారు. గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు.

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన తాత రామయ్య కుటుంబంతో కలిసి పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. తాత మరణించిన 13 రోజులకు రామోజీరావు జన్మించారు. దీంతో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అనే పేరు పెట్టారు. రామోజీ కన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. శ్రీ వైష్ణవ కుటుంబ నేపథ్యం కావడం, తల్లి చాలా భక్తిపరురాలు కావడంతో చిన్నతనంలో రామోజీకి భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని అల్లారుముద్దుగా పెంచారు. పెద్దక్కకు వివాహం కావడంతో చిన్నక్క రంగనాయకమ్మతో ఆయనకు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపని, వంట పనిలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అనే తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా రామోజీ రావు అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నారు.

రామోజీరావు గుడివాడలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. అనంతరం వ్యాపార రంగంలోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగారు. వ్యాపారంలో తొలి అడుగు 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ ఏర్పాటుచేసి.. నమ్మకానికి మారుపేరుగా నిలిపారు. 1969లో అన్నదాత ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం 1974 ఆగస్టు 10న ప్రారంభమైన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం. దేశంలోనే తొలిసారిగా కంట్రిబ్యూటర్ వ్యవస్థను పరిచయం చేసింది ఈనాడే కావడం విశేషం.

అలాగే, సినీరంగంలోనూ తనదైన ముద్రవేశారు రామోజీ. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. ప్రతిఘటన, మౌనపోరాటం, జడ్జిమెంట్, మయూరి, కాంచన గంగ వంటి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు. మీడియా, వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2016లో కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మీడియా, వినోద రంగంలో చెరగని ముద్రవేసిన రామోజీరావు.. ఎన్నో పురస్కారాలను, అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నారు.

గూగుల్ ట్రెండ్స్‌లో రామోజీరావు
ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. మేరు శిఖర స్థాయికి ఎదిగిన రామోజీరావు మరణం తెలుగు ప్రజలను కలచివేసింది. రామోజీరావుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆసక్తి కనబరిచారు. దీంతో రామోజీరావు పేరు గూగుల్ ట్రెండ్స్‌లో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోనూ రామోజీరావు గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img