Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

వైసిపి పాలనలో సంక్షోభంలో వ్యవసాయం

•అన్నదాతల సంక్షేమమే కూటమి లక్ష్యం
•రైతాంగానికి చంద్రన్నపాలనలో స్వర్ణ యుగం
•రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశంలోకి రండి
•పావులూరు,వింజనంపాడు నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిక
•తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి

విశాలాంధ్ర – బాపట్ల : అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసిపి పాలనలో సంక్షోభానికి గురైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బుధవారం పావులూరు వింజనంపాడు గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసారని ఎమ్మెల్యే ఏలూరి మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దే అన్నారు. అన్ని వ్యవస్థలతో పాటు వ్యవసాయ రంగాన్ని జగన్ ధ్వంసం చేశారన్నారు.అన్నదాతల సంక్షేమమే లక్ష్యం గా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
రైతాంగానికి చంద్రన్నపాలనలో స్వర్ణ యుగం గా ఉందని నేడు అన్నదాతల అప్పులు పాలయ్యారన్నారు.రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి బాటలు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం, మైన్, ల్యాండ్ మాఫియా కొనసాగుతోందన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
పావులూరు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి….
పావులూరు వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు…వారిలో వలేరు యేసుబు, పాగాల వీరయ్య, వలేరు నాగరత్తయ్య, ఎండ్లూరి ఆదాం, బత్తుల కోటేశ్వరరావు, పల్లపాటి సుబ్బారావు, రావూరి రామయ్య, తెళ్ళ బుజ్జి, తెళ్ళ అదియ్య, పాగల రాంబాబు, బత్తుల ఏసుబాబు, జొన్నలగడ్డ మహిమ కుమార్, సిరిమల వివేక్, కట్టెంపూడి నాగార్జున, వలేరు చిరుతేజ, పాగాల పూర్ణ, ఎండ్లూరి గాంధీ, సోమ ఇజ్రాయిల్, చుండూరి మరియ బాబు, వలేరు చిన్నబ్బాయి, సిరిమల కళ్యాణ్ లు పార్టీలో చేరారు.

వింజనంపాడు
వింజనంపాడు గ్రామానికి చెందిన కొందవి నాగేశ్వరావు, గంగవరపవు సురేష్, మేక అంకమ్మ, కోరేల లూథర్ లు ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే ద్రోణదుల తాళ్లూరి రామయ్య చౌదరికి ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img