Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

బాపట్ల వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌పై వాలంటీర్‌ ఆనందబాబు పోటీ

విశాలాంధ్ర బ్యూరో – బాపట్ల : వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్‌బాబు అనే వాలంటీర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బాపట్ల పార్లమెంట్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఐదేళ్లలో ఎంపీ సురేశ్‌ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అరాచకాల్ని భరించలేకే పోటీకి దిగినట్లు ఆనంద్‌బాబు తెలిపారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడిపే సురేశ్‌.. బాపట్ల ఎంపీ అయిన తర్వాత రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధికోసం ఉద్దండరాయునిపాలెంలోని ఎంపీ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img