ముంబయి: భారత్లో అతిపెద్ద కమర్షియల్ వెహికల్ ఉత్పత్తిదారు టాటా మోటార్స్ తమ కమర్షియల్ వాహనాల ధరలను పెంచనున్నది. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2% మేరకు ఈ వాహన ధరలను పెంచనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని రకాల కమర్షియల్ వెహికల్స్పైనా ధరలు పెంచుతున్నట్లు తెలిపింది ఇన్పుట్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో ధరలపై దీని ప్రభావం పడుతున్నదని పేర్కొంది.