Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

జగన్ ఇక ఇంటికే…

టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…

విశాలాంధ్ర ఏలూరు: రాబోయే ఎన్నికలలో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం అని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 3వ డివిజన్ లో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ, వైసిపి సిద్దం అంటే కూటమి యుద్ధం అంటుందన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడం అవసరమన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా మార్చారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే పరిశ్రమలు రప్పించి, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పటిస్తామని తెలిపారు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం కష్టాలనుండి గట్టెక్కుతుందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఒకే చోట రాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి అభిమతం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img