తమిళనాట డీఎంకేతో కుదిరిన పొత్తు
చెన్నై: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడులో పోటీ చేసే స్థానాలపై సీపీఐ, సీపీఎం, డీఎంకే మధ్య ఒప్పందం కుదిరింది. చెరో రెండు స్థానాల నుంచి సీపీఐ, సీపీఎం పోటీ చేయనున్నాయి. ఈ మేరకు సీట్ల సర్దుబాటు ఖరారైనట్లు డీఎంకే గురువారం వెల్లడిరచింది. ఆ పార్టీలు పోటీ చేసే స్థానాలు ఏవన్నది తర్వాత నిర్ణయించనున్నట్లు తెలిపింది. డీఎంకే కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం జరిగినట్లు పేర్కొంది. ఒప్పందంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు ఆర్.ముథరాసన్, కె.బాలకృష్ణన్ సంకతాలు చేసినట్లు ప్రకటన తెలిపింది. 2019లో సీపీఐ… తిరుప్పూర్, నాగపట్టణం నుంచి పోటీ చేయగా సీపీఎం… మధురై, కోయంబత్తూర్ నుంచి పోటీ చేసింది. కాగా, ఐయూఎంఎల్, కొందు దేశీయా మర్పొక్కు కజగం (కేఎండీఎకే)తో డీఎంకే ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే.