Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆరోగ్య సేవలు ప్రియం

ఇంటి బడ్జెట్‌లో పది శాతం అటే
వైద్య చికిత్సలు, సేవలు పొందలేక ప్రజలు అవస్థలు

న్యూదిల్లీ : దేశ ప్రజలు ఆరోగ్య సేవలు పొందాలంటే ఆర్థిక యాతన పడుతున్నారు. వైద్య చికిత్స, సేవలు ప్రియం కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కనీస వైద్యం సైతం పొందలేకపోతున్నారు. ప్రజలకు అందాల్సిన కనీస అవసరాల్లో వైద్యం ఒకటి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో వైద్య చికిత్సలు, సేవలు ప్రియం అయ్యాయి. వైద్య ఖర్చులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో విఫలమైంది. దీంతో దేశ ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అధికంగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఒక నివేదిక వెల్లడిరచింది. దాని ప్రకారం, భారత్‌లోని 9 కోట్ల మందికి పైగా ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అధికంగా వెచ్చిస్తున్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, సేవలు ప్రజలను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, వారి ఇంటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం… భారత్‌లో గణనీయమైన సంఖ్యలో ప్రజలు తాము వెచ్చించే మొత్తంలో పది శాతానికి మించి ఆరోగ్య సంరక్షణ పైనే ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఇంటి ఖర్చులో 25 శాతానికి పైగా ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నవారు 3.1 కోట్ల మందికి పైగా ఉన్నారు. 2017-18 నుంచి 2022-23 మధ్య తమ ఆదాయంలో ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఆరోగ్యం పైనే అధికంగా ఖర్చు చేయటం దేశంలోని అనేక ఇళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపి ఆర్థికంగా వారిని దెబ్బతీస్తుందని నివేదిక హెచ్చరించింది. మోదీ పాలనలో నానాటికీ ఆరోగ్య సంరక్షణ భరించని స్థాయికి చేరింది. ప్రజల సంపాదనంతా ఆరోగ్యం, సంబంధిత అత్యవసరాలకే వెళ్లిపోతున్నదని విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణపై ప్రజలు చేస్తున్న ఖర్చులో గణనీయమైన పెరుగుదల మహారాష్ట్ర, యూపీ, ఆంధ్ర ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, ఒడిశా, తెలంగాణలో నమోదయింది. మోదీ ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్యాన్ని మరిచి ప్రయివేటీకరణపై దృష్టి పెడుతున్నదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు దేశంలోని ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img