Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

కర్నూలులో హైకోర్టు బెంచ్‌

అమరావతిలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ న్యాయ కళాశాల
జూనియర్‌ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం: చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడిరచారు. సచివాలయంలో సోమవారం న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహిం చారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. బెంగుళూరుకు చెందిన నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇన్‌స్టిట్యూట్‌ను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, ఆ మేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాసిక్యూషన్‌ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని, దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్దతులను అవలంభించాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్‌ ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ…అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్‌ ప్రభుత్వం నుంచి ఉండకూడదని సీఎం వ్యాఖ్యానించారు. న్యాయ శాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్నముఖ్యమంత్రి, అన్ని అంశాలపై మరిన్ని సమగ్ర వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఫరూక్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img