Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

జగన్‌ వద్దకు ఆశావహులు

. మరో జాబితాపై కసరత్తు ముమ్మరం
. క్యాంప్‌ ఆఫీసుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు
. టికెట్ల కోసం యత్నాలు… రగులుతున్న అసమ్మతి

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికపై వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన అధికారి పార్టీ…ఐదో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. అదేసమయంలో టికెట్లు దక్కుతాయో…లేదోనని సిట్టింగులు ఆందోళన చెందుతున్నారు. ఐదో జాబితా ఖరారు కోసం శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వివిధ జిల్లాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలను సీఎం జగన్‌ పిలిపించారు. ఇప్పటివరకు నాలుగు విడతలుగా 68 స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో 58 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితా ప్రకారం 20 మంది సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానంలో ఐదుగురు జెడ్పీటీసీలకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. చాలామంది సిట్టింగులకు స్థానచలనం లేదా టికెట్లు నిరాకరణ జరిగింది. మిగిలిన నియోజకవర్గాలపై సీఎం జగన్‌ కసరత్తు చేపట్టారు. ఉమ్మడి తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తదితరులు పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. కాకినాడ ఎంపీ వంగా గీతకు ఇప్పటికే పిఠాపురం అసెంబ్లీ టికెట్‌ కేటాయించారు. అయితే, అక్కడ ఆమెకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొరబాబు సహకారం కరువైంది. దీంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్‌ స్థానాల ఇన్‌చార్జిల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. దీనిపై చర్చించేందుకుగాను కొంతమంది నేతలను సీఎం పిలిపించారు. ఐదో జాబితాలో ఎవరి సీట్లకు ఎసరు వస్తుందోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. టికెట్లు దక్కని వారంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు టీడీపీ, కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. తిరువూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణనిధికి సీటు దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను కచ్చితంగా ఎమ్యెల్యేగా పోటీ చేస్తానని, రెండు రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడిరచారు. టికెట్‌ ఇవ్వనందున అధిష్ఠానం పిలిచినా వెళ్లేది లేదని చెప్పారు. మరోవైపు, తీవ్ర నిరసనలు, రాజీనామాలు కొనసాగుతున్నా వైసీపీ అధిష్ఠానం మాత్రం వెనక్కి తగ్గకుండా ఇన్‌చార్జిలపై కసరత్తు కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img