London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం

ఐక్యంగా ముందుకు సాగుదాం: సీడబ్ల్యూసీ భేటీలో ఖడ్గే

న్యూదిల్లీ: పార్లమెంటు లోపల, బయటా ఇండియా ఐక్య సంఘటన సమన్వయంతో పని చేయవలసిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అన్నారు. లోక్‌సభ ఎన్నికల తీర్పు… విభజన, ద్వేష రాజకీయాలకు ‘నిర్ణయాత్మక తిరస్కరణ’ అని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖడ్గే మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో పార్టీ శక్తి సామర్థ్యాలతో పనిచేయలేదని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచారని, నిరంకుశ శక్తులకు, రాజ్యాంగ వ్యతిరేకులకు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. అధికార పార్టీ నియంతృత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడారని, ఇది గత పదేళ్ల రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించడమేనన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం సాధించినందుకు కొత్తగా ఎన్నికయిన కాంగ్రెస్‌ ఎంపీలకు అభినందనలు తెలుపుతూ… భారత్‌ జోడో, భారత్‌ జోడో న్యాయయాత్రలు సాగిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఓట్లు, సీట్లు పెరిగాయన్నారు. ‘ఇండియా’ భాగస్వాములను కూడా ఖడ్గే ప్రశంసించారు. ప్రతిపక్షం వివిధ రాష్ట్రాల్లో తన నిర్దేశిత పాత్ర పోషిస్తుందని, ప్రతిపక్షం మరొకదానికి సహకరించిందని చెప్పారు. ‘ఇండియా’ బృందం కొనసాగాలన్నదే మా సంకల్పం. పార్లమెంట్‌లోనూ, బయటా సమష్టిగా పని చేయాలి’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలు భారతదేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్యలని, వాటిని పార్లమెంట్‌లోనూ, బయటా లేవనెత్తుతూనే ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఇంకా, గతంలో విధానసభ ఎన్నికల్లో మెరుగ్గా రాణించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో మన పనితీరును మెరుగుపరచుకోలేకపోయాం. అలాంటి ప్రతి రాష్ట్రంపై త్వరలో ప్రత్యేక చర్చలు జరుగుతాయి’ అని ఆయన చెప్పారు. ‘మనం అత్యవసర నివారణ చర్యలు చేపట్టాలి. ఇవి సంప్రదాయంగా కాంగ్రెస్‌కు అనుకూల రాష్ట్రాలు. మనకు అవకాశాలు ఉన్న చోట, మన ప్రయోజనాల కోసం కాకుండా మన ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. ఈ కసరత్తును అతి త్వరలో నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను’ అని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నా…లేకపోయినా 24 గంటలు, 365 రోజులు ప్రజల మధ్యనే కొనసాగుతుందని, వారి సమస్యలు లేవనెత్తుతామని ఖడ్గే స్పష్టం చేశారు. అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మణిపూర్‌లో రెండు స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకున్నదని పేర్కొన్న ఖడ్గే… నాగాలాండ్‌, అసోం, మేఘాలయలో కూడా పార్టీ గెలిచిందని చెప్పారు. ‘మహారాష్ట్రలో మనం ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించాం.
దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చారు’ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఓటర్ల ప్రాబల్యం ఉన్న సీట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు కూడా పెరిగాయని ఖడ్గే చెప్పారు. మున్ముందు పట్టణ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ తన ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనం క్రమశిక్షణతో ఐక్యంగా ఉండాలి. ప్రజలు గణనీయమైన చర్యలలో మనపై తమ విశ్వాసాన్ని తిరిగి పొందారు. మనం దానిని నిలబెట్టుకోవాలి. ఈ తీర్పును నిజమైన వినయంతో అంగీకరిస్తున్నాం’ అని అన్నారు. రైతులు, వెనుకబడిన తరగతుల కోసం పనిచేస్తున్న సంస్థలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, చిన్న చిన్న వ్యాపారులు, న్యాయవాదులు, మేధావులు, స్వతంత్ర మీడియా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. సీడబ్ల్యూసీలో చర్చలు పార్టీ వేదికలోనే ఉండాలని, సమావేశంలో చర్చిస్తున్న వాటిపై ‘రన్నింగ్‌ కామెంటరీ’ ఉండకూడదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయకులను హెచ్చరించారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌తో పాటు ఇతర నేతలు చర్చల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img