Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

18 మంది బతుకులు ఛిద్రం

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో పేలిన రియాక్టర్‌

. ఎగిసిపడ్డ అగ్ని కీలలు
. 50 మందికి తీవ్ర గాయాలు
. ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశం

విశాలాంధ్ర – అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షి యా అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటె డ్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రియాక్టర్‌ పేలడంతో దట్టమైన పొగతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసె న్షియా అడ్వాన్సుడ్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమి టెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్‌ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఏడుగురు మృతి చెందగా, మొదటి అంతస్తు శ్లాబు కింద పడి మరో ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. రియాక్టర్‌ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయిందని, శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్‌ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ , ఎస్పీ ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు జరిగిన ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ రెండు షిఫ్టులలో 381 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిసింది. భోజన విరామ సమయంలో పేలుడు సంభవించడం వల్ల ఘటనా స్థలంలలో తక్కువ మంది ఉండటంతో అనేకమంది ప్రాణాలతో బయటపడ్డారని భావిస్తున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్‌ పేలుడుతో కుప్పకూలిన భవనం మొదటి అంతస్తు పైకప్పు శిథిలాల కింద మరికొందరి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎసెన్షియా కంపెనీ రియాక్టర్‌ పీలుడులో ఇప్పటివరకు 18 మంది మరణించగా వారిలో 10 మంది వివరాలు గుర్తించారు. మృతుల్లో సన్యాసినాయుడు(ప్లాంట్‌ ఏజీఎం), రామిరెడ్డి (ల్యాబ్‌ హెడ్‌), హారిక (కెమిస్ట్‌), పార్థసారథి (ప్రొడక్షన్‌ ఆపరేటర్‌), వై.చిన్నారావు(ప్లాంట్‌ హెల్పర్‌), మోహన్‌ (ఆపరేటర్‌), గణేష్‌ (ఆపరేటర్‌), హెచ్‌. ప్రశాంత్‌, ఎం.నారాయణ, పి.రాజశేఖర్‌ ఉన్నారు. మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం 22 మంది వరకు చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి…ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
సీఎం చంద్రబాబు గురువారం అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్‌ లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్‌ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతానికి సీఎం వెళ్తారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్‌ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్‌ తరలించేందుకు ఎయిర్‌ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా…ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img