23 మందికి 100 శాతం మార్కులు
న్యూదిల్లీ : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఎన్టీఏ విడుదల చేసిన పేపర్-1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం మార్కులు సాధించారు. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరపు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయితేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేశ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి 100 శాతం స్కోరు సాధించారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరైన విషయం తెలిసిందే. చివరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. తొలి విడత రాసిన విద్యార్థులు… రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండిరటిలో ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు.