ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా మీటింగ్ కొనసాగనుంది. ఈ మేరకు 6,100 పోస్టులకు గాను మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు.. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.