. కేసుకు ముగింపు పలకాలని సూచించిన సజ్జల
. 2019 జులై నుంచే అవినాశ్పై అనుమానం
. సీబీఐకి కీలక విషయాలు చెప్పిన సునీత
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో హతుని కుమార్తె నర్రెడ్డి సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడిరచారు. వివేకా హత్య కేసు చార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూ లాలను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి తనకు ఫోన్ చేశారని, అయితే తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్కు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానన్నారు. దీంతో ఎక్కువ సమయం తీసుకోనంటూ భారతి వెంటనే ఇంటికి వచ్చారని, ఆమెతో పాటు విజయలక్ష్మి, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావ డంతో ఆశ్చర్యపోయానన్నారు. ఆ సమయంలో తాను లిఫ్టు వద్దే నిలబడి వైఎస్ భారతితో మాట్లాడానని, ఆమె ఆందో ళనగా కనిపించారని సునీత అన్నారు. తండ్రి వివేకా మరణించాక తొలిసారి ఇంటికి వచ్చినందున బాధగా ఉన్నట్లు అనుకున్నానన్నారు. ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణా రెడ్డితో టచ్లో ఉండాలని భారతి చెప్పారన్నారు. మీడియాతో మాట్లాడాలని సజ్జల తనకు చెప్పారని, సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని సునీత చెప్పారు. గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియో పంపించానన్నారు. అయితే వీడియో కాదు…ఈ అంశానికి ముగింపు పలికేలా ప్రెస్మీట్ పెట్టాలని సజ్జల చెప్పారన్నారు. జగనన్నతో పాటు అవినాశ్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారని, అయితే తాను అప్పటి వరకు అవినాశ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. అవినాశ్ పేరు ప్రస్తావించా లని సజ్జల చెప్పినప్పుడు కొంత సంకోచించానన్నారు. అవినాశ్ అభ్యర్థిత్వాన్ని తన తండ్రి కోరుకోలేదని తెలుసునని, రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విబేధాలు ఉన్నాయని, సజ్జల సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ పెట్టానని సునీత తెలిపారు. 2019 జులైలో అవినాశ్రెడ్డిపై తనకు అనుమానం మొదలైందని, తన కుమారుడికి ముందే తెలుసునని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని సునీత పేర్కొన్నారు. వివేకా మృతి విషయం బయటకు రాకముందే తన కుమారుడికి తెలుసునని ఆమె చెప్పారని, అవినాశ్రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ క్రమంలో భారతి, సజ్జల వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్లను సీబీఐకి సునీత ఇచ్చారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదట్నుంచీ అడుగుతున్నానని, పొరపాటు జరిగిందని తెలుసు కానీ క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదని సునీత అన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని తండ్రి వివేకా చాలా కష్టపడ్డారన్నారు. ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని, తాను మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నా రని, ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలపై ఆరోపణలున్నా యన్నారు. వివేకా ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాశ్ తనకు చెప్పారని, అది మనసులో పెట్టుకొని టీడీపీ నేతలే ఈ నేరానికి పాల్పడ్డారని అవినాశ్ చెప్పారన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని సునీత తెలిపారు.