Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతి.. గెజిట్‌ విడుదల

ఏపీలోని కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్‌ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విచారణ చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం గెజిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ మేరకు ఏపీలో సీబీఐ విచారణకు రాష్ట్రప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అని కండీషన్‌ పెట్టింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జూలై 1నుంచే అమల్లోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు.. పెంచేందుకు ఈ గెజిట్‌ వీలు కల్పిస్తుంది. దీని ద్వారా సీబీఐ నిర్ధారించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అయింది. చంద్రబాబు నాయుడు 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఏపీలో సీబీఐ దర్యాప్తునకు ాసాధారణ సమ్మతిని్ణ ఉపసంహరించుకున్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీలో సీబీఐ ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి సమ్మతి ఇస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ వ్రాతపూర్వక అనుమతితో మినహా, ఏపీ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన కేసుల్లో సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని ఎన్డీఏ సర్కార్‌ షరతు విధించింది. ఈ మేరకు ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం, 1946 (1946 చట్టం నెం.25)లోని సెక్షన్‌ 3 కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సెక్షన్ల దర్యాప్తు కోసం ఎపిలో సిబిఐ అధికార పరిధిని పొడిగిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ 792ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ విశ్వజీత్‌ జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img