అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రాట్ పార్టీ విరాళాల సేకరణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వలసవాదం కీలక అంశంగా మారడంతో.. వారి వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందని బైడెన్ అన్నారు. అయితే, ఆయన భారత్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. వలసవాదం భయమని అన్నారు. విదేశీ వలసదారులంటే భారత్కు భయమని, వారిని తమ దేశంలోకి అనుమతించదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా, జపాన్లదీ కూడా అదే పరిస్థితి అని, అవి వలసదారులను ఎంతమాత్రమూ ఆహ్వానించవని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని బైడెన్ అన్నారు. అందుకు భిన్నంగా అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తోందని, వారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంటారని చెప్పుకొచ్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం డెమొక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రసంగించారు. అమెరికాకు మిత్రదేశాలైన భారత్, జపాన్లను తక్కువ చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం చర్చనీయాంశమైంది. ామన ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందడానికి చెందడానికి మీరు అనేక ఇతర కారణాలు ఉన్నాయి.. ఎందుకంటే మనం వలసదారులను స్వాగతిస్తున్నాం.. చైనా ఎందుకు ఆర్ధికంగా చాలా దారుణంగా తయారయ్యింది? జపాన్, రష్యా, భారత్లు ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే వారికి వలసదారులంటే భయం.. వలసలను వారు స్వాగతించరు.. కానీ మనం వలసదారులతో శక్తివంతులవుతున్నాం్ణ అని బైడెన్ వ్యాఖ్యానించారు.
విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆసియా అమెరికన్, స్థానిక హవాయి, పసిఫిక్ దీవుల సంతతికి చెందిన వలసదారులను ఉద్దేశించి బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇమ్మిగ్రేషన్ ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజా గాలప్ సర్వే ప్రకారం ప్రజలు వరుసగా మూడో నెల అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. ా 27% మంది అమెరికన్లు అమెరికా ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఇమ్మిగ్రేషన్ అని చెప్పారు,.. వరుసగా మూడో నెల గ్యాలప్ పోల్లో ఇది అగ్రస్థానంలో ఉంది.. గత 24 ఏళ్లలో ఈ ప్రత్యేక సమస్య సుదీర్ఘమైన సాగతీత్ణ అని వాషింగ్టన్కి చెందిన ఓ విశ్లేషణ సంస్థ పేర్కొంది.
2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంబంధించిన అంచనాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ 6.8% వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి. 2023తో పోల్చితే వృద్ధిరేటు తగ్గుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. జపాన్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో 0.9% వృద్ధి, భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో 6.8% బలమైన వృద్ధి రేటు ఉంటుందని తెలిపింది. దీంతో బైడెన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.