వీడియో షేర్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవి
రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్ లో ఆయన పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్విట్టర్ కంప్లైంట్ ను తన నుంచి వచ్చిన అధికారిక ఫిర్యాదుగా భావించాలని, తనను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఆర్జీవీ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాపై టీడీపీ వర్గాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా.. సినిమా విడుదలను కోర్టు తాత్కాలికంగా ఆపేసింది. ఓటీటీ సహా ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ప్రదర్శించవద్దంటూ సూచించింది. సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. ఈ నెల 29న వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు.