న్యూదిల్లీ: గోద్రా అల్లర్ల నేపథ్య కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్కు బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
సాధారణ బెయిల్ కోసం ఆమె చేసుకున్న ఫిర్యాదును తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏఎస్ బొప్పన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. సెతల్వాడ్పై చార్జిషీటు నమోదైందని, ఆమెను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆమె పాస్పోర్టు సెషన్స్ కోర్టు వద్ద ఉందని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించబోరని, వారికి దూరంగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగితే నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా గుజరాత్ పోలీసులకు అనుమతిచ్చిస్తూ సెతల్వాడ్కు బెయిల్ మంజూరు చేసింది. సెతల్వాడ్ గతేడాది జూన్ 25న అరెస్టు అయిన విషయం విదితమే.