అలర్ట్ చేసిన వాతావరణశాఖ
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు ఊపందుకున్నాయి. రెండు రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి.. మరో రెండు రోజుల పాటూ ఈ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తోంది వాతారణశాఖ. ఈ రెండు రోజుల మాత్రం కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిశాయి.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. అక్కడక్కడా గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజులుగా వానలు పడుతున్నాయి. ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది వాతావరణశాఖ. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని.. మరికొన్ని చోట్ల గాలులు వీస్తాయంటున్నారు. నేడు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు సోమవారం నుంచి మంగళవారం వరకు అత్యధికంగా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో 95.5 మి.మీ.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 94.75, అనకాపల్లిజిల్లా నాతవరంలో 88.0, బాపట్ల జిల్లా కూచినపూడిలో 87.25 మి.మీ వర్షపాతం నమోదైంది. విజయనగరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, ప్రకాశం, జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. ఈ వానలతో వ్యసాయం పనుల్ని రైతులు ముమ్మరం చేశారు.