గ్రీస్: సోవియట్ యూనియన్ విప్లవయోధుడు వ్లాదిమిర్ లెనిన్ శతవర్థంతిని పురస్క రించుకొని ఆయనకు గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా కేకేఈ కేంద్ర కార్యాలయంలోని హాల్లో నిర్వహించిన సభకు అన్ని వయ స్సుల వారు హాజరయ్యారు. కార్మికులు, యువతీ యువకులతో హాలు కిక్కిరిసింది. సభనుద్దేశించి కేకేఈ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కౌట్సంబస్ ప్రసం గించారు. లెనిన్ విప్లవ వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎర్ర జెండా మరోమారు అంతటా రెపరెపలాడుతుందని ఆకాంక్షించారు. లెనిన్గ్రాడ్, మాస్కో, బెర్లిన్లోనే కాదు యూరప్ వ్యాప్తంగా, ఆసియా, అమెరికా, ఆఫ్రికా, ఓషియానాతో పాటు ప్రపంచమంతటా అరుణపతాకం ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రజెండాతోనే ప్రజలకు మంచి జీవితం లభించగలదని అన్నారు. లెనిన్ ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆయన అన్నారు. దిమిత్రిస్ ప్రసంగం ముగిసిన తర్వాత సోవియట్ కంపోజర్లు… ఇతర కళాకారుల కాన్సర్ట్ జరిగింది. అది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.