ఫ్రాన్స్ ప్రధాని అట్టల్ ప్రకటన
పారిస్: అన్నదాతల ఆదాయాన్ని మరింత మెరుగుగా పరిరక్షించేందుకు కొత్త చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని ఫ్రాన్స్ ప్రధాని గేబ్రియల్ అట్టల్ ప్రకటించారు. మెరుగైన పరిస్థితులు, పంటలకు మద్దతు ధరల కోసం ఆందోళనలు కొనసాగిస్తున్న రైతాంగాన్ని శాంతింపజేసే ప్రయత్నాన్ని ఆయన చేశారు. రీటెయిలర్లు, వినియోగ వస్తువుల కంపెనీలతో చర్చల్లో రైతుల స్థాయిని బలపరుస్తామని బుధవారం హామీనిచ్చారు. ‘ఇగాలిమ్ చట్టం’ గురించి తాజా సమాచారాన్ని అందజేసే క్రమంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఈ వారంతంలో వార్షిక ‘సాలాన్ డె అగ్రికల్చర్ ఫ్రార్మింగ్ ట్రేడ్ ఫెయిర్’ ప్రారంభం కానున్న వేళ ఆగ్రహించిన రైతులను శాంతిపజేసి వారిలో ఆందోళనను తగ్గించేందుకు ప్రధాని ఈ మేరకు ప్రకటన చేశారు.