Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాలంటరీ వ్యవస్థ వద్దని అవ్వ తాతల వద్ద చెప్పే ధైర్యం ఉందా

విశాలాంధ్ర- కర్నూల్ సిటీ : వాలంటరీ వ్యవస్థ వద్దని అవ్వ తాతల దగ్గరకు వచ్చి చెప్పే దమ్ము, ధైర్యం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఉందా అని వైసిపి కర్నూల్ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు,కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ప్రశ్నించారు. శుక్రవారం నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో కర్నూలు, నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బి వై రామయ్య కాటసాని రాంభూపాల్ రెడ్డిలు మీడియా సమావేశంలో మాట్లాడారు. బివై రామయ్య మాట్లాడుతూ తప్పులను ప్రశ్నించే పార్టీగా చెప్పుకుంటున్న జనసేనాని 2014 లో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు.జనసేన పార్టీకి ఏపీలో భవిష్యత్తు లేదని తెలిసే జనసేనాని సీఎంపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.ప్రజలకు మేలు చేస్తున్న సీఎం జగన్ ను సైకో అంటున్నారని చంద్రబాబు కన్నా పెద్ద సైకో మరెవ్వరూ లేరన్నారు.కాటసాని రాంపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయంలో ఉన్న నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి కానీ అధికార పార్టీ నాయకుల పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తోలు తీస్తాం తాట తీస్తామని సినిమా డైలాగులు మాట్లాడితే అవతలి వారు చూస్తూ ఊరికే కూర్చొరన్న విషయాన్ని టిడిపి,జనసేన పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు విక్రమ్ సింహరెడ్డి, లక్ష్మి కాంత్ రెడ్డి, గాజుల శ్వేతా రెడ్డి నాయకులు సిహెచ్ మద్దయ్య, ధనుంజయ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img