విశాలాంధ్ర, పెద్దకడబూరు : ప్రజల చెంతకు పాలన తెచ్చేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులోని సచివాలయం – 2 లో ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులు అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను గుర్తించారని వారు తెలిపారు. సచివాలయాల ద్వారా అందజేసే 11 రకాలైన సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం 650 వివిధ రకాల ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే విశిష్టశేవలను అందించిన వాలంటీర్లకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ రవిచంద్రా రెడ్డి, నాయకులు విజయేంద్ర రెడ్డి, శివరామిరెడ్డి, ముక్కరన్న, తిక్కన్న, అర్లప్ప, ఆర్ ఐ మహేష్, వీఆర్వోలు వీరారెడ్డి, నరసప్ప, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.