పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త డ్రోన్ రూల్స్`2021ను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ రూల్స్ 2021 స్థానంలో ఇవి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, డ్రోన్లకు గుర్తింపు సంఖ్యలు ఉంటాయని, రెక్విజిట్ వివరాలను డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో అందించడం ద్వారా ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందవచ్చు. గతంలో ఉన్న వివిధ అనుమతుల ప్రక్రియను తొలగించారు. అలాగే ప్రభుత్వం డ్రోన్ ఆపరేట్ చేయడానికి ఫీజును కూడా నామమాత్రానికి తగ్గించింది. డ్రోన్లు తీసుకెళ్లే సామర్థ్యాన్ని కూడా 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచింది.