Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

విద్యుత్ ధరలను తగ్గించాలని దీపాలతో సిపిఐ, ఏఐవైఎఫ్ నిరసన


. ప్రజాధనాన్ని దోచుకుంటున్న ప్రభుత్వం అంటూ నినాదాలు
. సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలి

విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, గురువారం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సిపిఐ, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో దీపాలతో నిరసన తెలిపారు. బిల్లుల పేరుతోప్రజాధనాన్ని దోచుకుంటున్న ప్రభుత్వం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సిరాజ్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా మాట్లాడుతూ బిజెపి తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ బిల్లును దేశంలోని అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును అమలు చేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.ప్రభుత్వం గత సంవత్సరం సుమారు మూడున్నర వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ బిల్లులు వేసి ప్రజల నుండి డబ్బును వసూలు చేసిందని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విద్యుత్ సంస్కరణల పేరుతో అదనపుబిల్లులు ద్వారా ప్రజల నుండి దాదాపురూ.6500 కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కరెంటు బిల్లులను చూస్తేనే షాక్ కొట్టే రీతిలో, విద్యుత్ చార్జీల బిల్లులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తక్షణమే విద్యుత్ సంస్కరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సంహరించుకొని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజీజ్, అహ్మద్, గౌస్, సర్దార్, బాదుల్లా, ఫయోం, షాకీర్, రసూల్, లతీఫ్ అహ్మద్, యూసుఫ్, షారుఖ్, షాజహాన్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img