జెడ్పిటీసీ ఇంటూరి భారతి
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పథకం పేదలకు శ్రీరామ రక్ష అని జెడ్పిటీసీ ఇంటూరి భారతి అన్నారు.గురువారం మండలంలోని శాఖవరం మరియు నూకవరం గ్రామాలలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జడ్పిటిసి ఇంటూరి భారతి మరియు ఎంపీపీ పొనుగోటి మౌనిక హాజరైనారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఇంకనూ సంక్షేమ పథకాలు అందనివారికి జగనన్న సురక్ష ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు అర్హత ఉండి ఇంకనూ సంక్షేమ పథకాలు అందనివారికి అవసరమైన 11 రకాల సర్టిఫికెట్ లను జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.వైసీపీ ప్రభుత్వం ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే మరొకవైపు అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు అందిస్తుందని అన్నారు.పేదలకు మేలుచేయడంకోసం నవరత్నాలు పథకాలను 100శాతం అమలుచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా మనమందరం కలిసి కట్టుగా 2024 లో ముఖ్యమంత్రి గా ఆశీర్వదించి రాష్ట్రఅభివృద్ధి కి సహకరించాలని కోరారు.అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఫీ అహ్మద్,తహసీల్దార్ సుందరమ్మ,శాఖవరం సర్పంచ్ గడ్డం భవాని,ఎంపీటీసీ వడ్లమూడి జయమ్మ,ఉపసర్పంచ్ ఆవుల లక్షమ్మ,నూకవరం సర్పంచ్ దాచర్ల శాంతమ్మ,మండలవ్యవసాయఅధికారి హేమంత్ భరత్ కుమార్,డీటీ హుస్సేన్,ఈఓపీఆర్డీ సుమంత్, జేసిఎస్ మండల కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు, మండల మీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి,వైసీపీ నాయకులు ఇంటూరి హరిబాబు,నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,నవులూరి హజరత్తయ్య,వడ్లమూడి రమేష్,రూపినేని వెంకటేశ్వర్లు,గడ్డం మాధవరావు,నత్తా బాబూరావు,సాదం రామయ్య,సచివాలయకన్వీనర్లు గడ్డం శివరామయ్య,దాచర్ల వెంకట్రావు, సచివాలయ సిబ్బంది మరియు మండల అధికారులు,గృహసారధులు, వలంటీర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు