ఎస్టియు
విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : వేలాది ఉపాధ్యాయ పోస్టులకు మంగళం పాడిన రాష్ట్ర ప్రభుత్వం, మరొక దుర్మార్గమైన ఆలోచనతో అప్రెంటిస్ విధానంతో టీచర్ల నియామకాన్ని చేపడతామని ప్రకటించడానికి ఎస్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఎస్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంట మోహన్ దుయ్య పట్టారు. ఆదివారం నెల్లూరులోని రామకోటయ్య భవన్లో నెల్లూరు జిల్లా ఎస్టియు 77వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు వేధింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి రద్దు చేయకపోగా జిపిఎస్ భూతాన్ని ప్రవేశ పెట్టడం చాలా దారుణమని ఆయన అన్నారు. వేతన సవరణ, కరువు భత్యం, గురించి అసలు మాట్లాడే మూసే లేదని, ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్య వర్ణనాతీతమని గంట మోహన్ అన్నారు. ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి అశోక్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల నుండి పొదుపు చేసుకున్న పిఎఫ్ ను ఏపీ జి ఎల్ ఐ మొత్తాలకు ఈ ప్రభుత్వంలో భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఎస్ టి యు నెల్లూరు జిల్లా అధ్యక్షులు జి రాజ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పన ఏడుకొండలు,ఆర్థిక కార్యదర్శి నరసింహం, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ లతోపాటు వివిధ మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని ప్రసంగించారు.
అనంతరం ఎస్టియు నెల్లూరు జిల్లా కమిటీని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నది పరిశీలకులుగా గంట మోహన్ వ్యవహరించగా జిల్లా కమిటీ నూతనఅధ్యక్షుడిగా వై అశోక్ బాబు( వివి పాలెం)
ప్రధాన కార్యదర్శిగా జి రాజ్ మనోహర్(నెల్లూరు అర్బన్) ఆర్థిక కార్యదర్శిగా కె నరసింహం ( టీపి గూడూరు), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా అప్పన ఏడుకొండలు, పి కృష్ణయ్య,కె కృష్ణ, డి మహేష్ బాబు లతోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.