ఏపిఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ
ఆగష్టు 21, 22తేదీలలో విజయవాడలో జరగనున్న ఏపి ఎన్జీఓ 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు పెద్దఎత్తున ఉద్యోగులు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఏపిఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వి రమణ పిలుపు నిచ్చారు. గురువారం పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవనంలో పార్వతీపురం,కురుపాం తాలూకా యూనిట్ల ఎన్జీఓ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.రాష్ట్ర సంఘం ఆదేశాలు మేరకు జరుగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంను విజయవంతం చేయాలని కోరారు.దీనికి సంబందించి కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి మొదటి రోజు విచ్చేస్తారని తెలిపారు.పండుగ వాతావరణంలో జరిగే కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా హాజరు కావాలని తెలిపారు.దీనికి సంబందించి సావనీర్ విడుదల,ఉద్యోగులకు సంబందించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రసంఘం ఇచ్చిన ఆదేశాలు మేరకు రెండు తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులతోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.ఎక్కువ మంది ఉద్యోగులను కౌన్సిల్ సమావేశాలకు హాజరగునట్టు తగుచర్యలు తీసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. సభనువిజయవంతం చేసి ఏపి ఎన్జీఓ ఐక్యతను, బలాన్ని తెలియపరచే విధంగా ఉండాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో విజయనగరం జిల్లా కార్యదర్శి ఆవు సురేష్,జిల్లా ఉపాధ్యక్షులు కె.బి శ్రీను , పార్వతీపురం అధ్యక్షులు జి వి ఆర్ ఎస్ కిషోర్,అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ,కురుపాం తాలూకా యూనిట్ అధ్యక్షులు ప్రకాశరావు ,కార్యదర్శి రామకృష్ణ, రెండు యూనిట్ ల కార్యవర్గ సభ్యులు, ఏపి ఎన్జీఓ సంఘం నాయకులు పాల్గొన్నారు