విశాలాంధ్ర,పార్వతీపురం:పార్వతీపురం నియోజకవర్గంలోని టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేసి గెలిపించి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసేందుకు కష్టపడి కలిసి పనిచేద్దామని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, మాజీఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తెలిపారు. మంగళవారం నాడు మాజీఎమ్మెల్సీ జగదీష్ కార్యా లయంవద్ద నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటుచేసి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన బోనెల విజయ్ చంద్రను ఆహ్వానించి ఆయనకు దుశ్శాలువాకప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.కుటుంబంలో వలే చిన్న చిన్న తగాదాలు వచ్చిన అంతా కలిసికట్టుగా ఉండి పార్టీ గెలుపు కోసం పనిచేద్దామని వారంతా తెలిపారు. పార్టీలో రెండు వర్గాలపేరిట జరుగుతున్న ప్రచారానికి మాజీ ఎమ్మెల్సీ జగదీష్ తెరదించారు. నియోజక వర్గంలోని మూడుమండలాలు, పురపాలక సంఘం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతా కలిసికట్టుగా ఉండి టీడీపీ గెలుపు కోసం పనిచేద్దామని వారంతా తెలిపారు.బుదవారం నుండి అంతా కలిసి కట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుదామని, అరమరికలు లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్వతీపురం సీటును గెలిపించి గిఫ్టుగా అందజేస్తామని తెలిపారు. పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తెలిపారు.టీడీపి అభ్యర్ధి బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన చిన్న చిన్న సంఘటనలను మరిచి, అరమరికలు లేకుండా ఉండి కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేద్దామని తెలిపారు. ముగ్గురు కలిసికట్టుగా ఉంటే టీడీపీ గెలుపు సులభమని అక్కడకు వచ్చిన జగదీష్ అనుచరనాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలిపారు.ఈకార్యక్రమానికి మూడు మండలాలు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.