Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

జాబ్ మేళాకు 77 మంది విద్యార్థులు ఎంపిక..

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్- ఎన్. బాలస్వామి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఎంప్లాయిమెంట్ షీట్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహకారంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా జాబ్ మేళాను నిర్వహించినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎన్. బాలస్వామి, నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి కె తేజ్ కుమార్, సిడాప్- డిపిటిఎమ్ నారాయణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 5 కంపెనీ ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని, 188 మంది జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఇంటర్వ్యూలో 77 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కావడం పట్ల కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ధర్మవరం బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్, మంత్రి ముఖ్య అనుచరులు హరీష్ పాల్గొని, ఈ జాబ్ మేళా యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ జాబ్ మేళా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది అని తెలిపారు. నిరుద్యోగులకు ఐదు కంపెనీ ప్రతినిధులు ముందుకు రావడం వారి భవిష్యత్తుకు పునాది వేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడాప్ సిబ్బంది, ఎంప్లాయిమెంట్ అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img